మూసాపేట, ఏప్రిల్ 19: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ సూచించారు. మండలంలోని దాసరిపల్లి, వేముల, నందిపేట, కొమిరెడ్డిపల్లి గ్రామాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన స్థానిక నాయకులతోపాటు కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ రఘుపతిరెడ్డి, జిల్లా డైరెక్టర్ లక్ష్మీనర్సింహయాదవ్, నాయకులు కొండయ్య, గోవిందరెడ్డి, నర్సింహారెడ్డి, రాజు, రాజేందర్రెడ్డి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా ఎఫెక్ట్: కేరళలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ
వరంగల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ : మంత్రి ఎర్రబెల్లి