బిజినేపల్లి, ఏప్రిల్ 29 : మండలంలోని గంగారం, లట్టుపల్లి, మమ్మాయిపల్లిని ఆనుకొని ఉన్న అడవిలో చిరుతలు సంచరిస్తున్నాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు ఇటీవల అడవిలో సీసీ కెమెరా లు అమర్చారు. కాగా గంగారం అటవీ ప్రాంతంలోని నేరేడువంపు సమీపంలో, సోలార్ పంప్సెట్లు వద్ద నీ టిని తాగుతూ మూడు చిరుతలు కెమెరాకు చిక్కాయి. నీటికుంటల వద్ద సాంబారులు అనే అడవి జంతువు లు కూడా కనిపించాయి. అడవిలో చిరుతలు సంచరిస్తున్నాయని నిర్ధారణ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే చిరుతలను పట్టుకుంటామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.