SSC Results | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదలచేస్తారు. విద్యార్థులు ఫలితాల కోసం https:// results. bse.telangana. gov.in, https://results.bsetelangana. org వెబ్సైట్లను సంప్రదించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఫలితాలు నమస్తే తెలంగాణ, తెలంగాణటుడే వెబ్సైట్లల్లోనూ అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు https://www.ntnews.com, https:// telanganatoday.com వెబ్సైట్లను సంప్రదించవచ్చు. ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. వీటికి 5.08, 385 విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.