వరంగల్ అర్బన్ : వరంగల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ ఖాయమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. జిల్లాలోని హసన్ పర్తిలోని కేఎల్ఎన్ గార్డెన్స్, హన్మకొండలోని మయూరి గార్డెన్స్ లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని 66 డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్లతో ఎర్రబెల్లి సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ హాజరై నేతలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలతో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు అవడం ఖాయమన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేసి అన్ని డివిజన్ల అభ్యర్థులను బంపర్ మెజార్టీతో గెలిపించడానికి శాయ శక్తుల కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
అన్ని డివిజన్లలో ప్రతి ఓటర్ ను కలిసి మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిద్దాం. ప్రతిపక్షాల బండారాన్ని బయట పెడదాం. ముఖ్యంగా బీజేపీ అబద్ధాలు, అసత్యాల ప్రచారాలను తిప్పి కొట్టాలని మంత్రులు చెప్పారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, ఒడితెల సతీష్ కుమార్, గండ్ర వెంకటరమణా రెడ్డి, సుంకే రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జెడ్పీ చైర్మన్లు సుధీర్ కుమార్, బిందు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
‘మల్లన్న’ ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత
మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
కూలీల ఆటో బోల్తా ..నలుగురికి తీవ్ర గాయాలు