చేర్యాల/సిద్దిపేట : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు ఆర్జీత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మల్లన్న క్షేత్రంలో కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో దానిని అరికట్టేందుకు ఆలయంలో ఆర్జిత సేవలను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
భక్తులకు స్వామి వారి లఘుదర్శనంతో పాటు ప్రసాదాలు, ధర్మశాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పక కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. అలాగే క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే హనుమాన్ జయంతి ఉత్సవాలతో పాటు శ్రీరామ నవమి ఉత్సవాలకు భక్తుల అనుమతి లేదన్నారు.
హనుమాన్ జయంతి, శ్రీరామ నవమి ఉత్సవాలను ఆలయ సంప్రదాయం మేరకు నిర్వహిస్తామన్నారు. భక్తులు ఆలయవర్గాలకు సహకరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
కూలీల ఆటో బోల్తా ..నలుగురికి తీవ్ర గాయాలు