హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరానికిగాను కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 19న సాయంత్రం 7 గంటలకు ముగియనున్నాయి. ఆసక్తి కలిగినవారు అధికారిక వెబ్సైట్ kvsonlineadmission.kvs. gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) వెల్లడించింది. ఎంపికైన విద్యార్థులకు సంబంధించిన మొదటి జాబితాను ఏప్రిల్ 23న ప్రకటించనున్నారు. రెండో జాబితాలను ఏప్రిల్ 30న, తుది జాబితాను మే 5న వెల్లడిస్తారు.
అదేవిధంగా రెండో తరగతి, ఆపై తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 8 (ఉదయం 8 గంటలకు) నుంచి ఏప్రిల్ 15 (సాయంత్రం 4 గంటలు) వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 11వ తరగతిలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ పత్రాలను కేంద్రీయ విద్యాలయ వెబ్సైట్ kvsangathan.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..