గువాహటి: అసోంలో ఎన్నికలు తుదిదశకు చేరుతుండగా కాంగ్రెస్ కూటమికి గట్టి ఎదురు దెబ్బతగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని బీపీఎఫ్ కూటమికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి అధికార బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. మరో ఐదు రోజుల్లో మూడో విడుత పోలింగ్ జరుగనుండగా ఈ పరిణామం చోటుచేసుకోవడంతో కాంగ్రెస్పార్టీ నేతృత్వంలోని బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) ఖంగుతున్నది. రాష్ట్రంలోని తముల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రీరాందాస్ బసుమతరాయ్ని బీపీఎఫ్ తన అభ్యర్థిగా ప్రకటించింది.
అయితే ఆయన రాష్ట్ర మంత్రి హిమంత బిస్వా శర్మను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హిమంత బిస్వా ట్వీట్ చేశారు. అసోంలో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈసందర్భంగా ఆయన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. శ్రీరాందాస్తోపాటు బీపీఎఫ్కు చెందిన నలుగురైదుగురు అభ్యర్థులు కమల దళంలో చేరనున్నట్లు తెలుస్తున్నది. ఏప్రిల్ 6న జరుగనున్న తుది, మూడో విడుతలో భాగంగా తముల్పూర్ నియోజకవర్గంలో కూడా పోలింగ్ జరగనుంది.
అసోంలో నేడు రెండో విడుత పోలింగ్ జరుగుతున్నది. ఇందులో భాగంగా 39 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో 34 స్థానాల్లో బీజేపీ పోటీచేస్తుండగా, 24 స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. మొత్తం 394 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 73,44,631 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మార్చి 27న 47 స్థానాలకు తొలివిడుత పోలింగ్ జరుగగా, ఈనెల 6న తుది, మూడో విడుదల జరుగనుంది. వచ్చే నెల 2న ఫలితాలు వెలువడనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..