ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా టీకాల దొంగతనం చోటు చేసుకుంది. పాకిస్తాన్ లోని లాహోర్ ఆస్పత్రిలో 550 వాక్సిన్ డోసులు దొంగిలించబడ్డాయని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఇదే ఆస్పత్రిలో 350 వాక్సిన్ డోసులు వృథా అయ్యాయి.
ఇలా ఒక పక్క వ్యాక్సిన్ వృథా కావడం, మరో పక్క దొంగతనం జరుగుతుండటంతో ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. డోసుల వృథాకు కారణమైన మెడికల్ సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశారు. అయితే దొంగిలించిన కరోనా వ్యాక్సిన్ డోసులను ప్రముఖులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. డోసుల దొంగతనంపై అధికారులు ఆడిట్ నిర్వహిస్తున్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్లో కరోనా సెకండ్ వేవ్ రావడంతో.. దాని నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది.
ఇవీ కూడా చదవండి..