బామ్కో: ఒక కాన్పులో ఇద్దరు, ముగ్గురు జన్మించడం మనం చూస్తుంటాం. అయితే, మాలికి చెందిన ఓ మహిళ 9 మందికి జన్మనిచ్చి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో 25 ఏండ్ల మహిళ హలీమా సిస్సే తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి వార్తల్లో ఉన్నారు. సిస్సే కాన్పు సజావుగా సాగేందుకు మాలి ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నది. మొరాకోలో ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి శిశువులను బయటకు తీశారు. ఈ తొమ్మిది మంది పిల్లల్లో ఐదుగురు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు దవాఖాన యాజమాన్యం ప్రకటించింది.
మార్చి నెలలో హలీమా సిస్సేకు అల్ట్రాసౌండ్ చేయగా గర్భం అసాధారణంగా ఉన్నట్లు తేలిందని మాలి ఆరోగ్య మంత్రి ఫాంటా సిబి తెలిపారు. ఆ సమయంలో ఏడుగురు పిల్లలున్నారని నివేదిక వచ్చింది. సంక్లిష్ట పరిస్థితుల కారణంగా ఆమెను మొరాకోకు తరలించి కాన్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొరాకోలో మరోసారి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయగా ఏడుగురు పిల్లలు కనిపించారు. డెలివరీ సమయం దగ్గరపడినా నొప్పులు రాకపోవడంతో వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేశారు. సిస్సే గర్భం నుంచి తొమ్మిది మంది పిల్లలను బయటకు తీసి ఊపిరిపీల్చుకున్నారు. దీనిని చాలా అరుదైన సంఘటనగా భావిస్తున్నట్లు మాలి ఆరోగ్య మంత్రి సిబి చెప్పారు. హలిమాతోపాటు పిల్లలంతా ఆరోగ్యంగా ఉన్నారని తేలిన తర్వాత వారిని మాలికి తీసుకువస్తామని ఆయన తెలిపారు.
ఎలోన్ మస్క్ ఇంటర్నెట్కు బఫర్ ఒపెనింగ్స్
చైనాలో ఉయ్గార్ ముస్లింలపై దారుణాలకు వ్యతిరేకంగా న్యూజిలాండ్ పార్లమెంటు ప్రతిపాదన
బుద్గాంలో డీఆర్డీఓ 500 పడకల దవాఖాన
టీకా వృథా తగ్గేలా చేస్తున్న కేరళకు ప్రధాని ప్రశంసలు
భారత్లో అమెరికా కొత్త రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్..?
హర్యానాలో ప్రభుత్వ ఆజమాయిషీలో ప్రైవేట్ దవాఖానలు
ఓటమితో మమతకు సీఎంగా నైతిక హక్కు లేదు : త్రిపుర సీఎం బిప్లబ్
యాహూతో గూగుల్ను సవాల్ చేయాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్..?!
ఫుట్పాత్పై రసరమ్య సంగీత బాణీలు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..