శ్రీశైలం, అక్టోబర్ 4 : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నుంచి డ్యాం ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల విద్యుదుత్పత్తి నుంచి 37,936, సుంకేసుల నుంచి 33,656 క్యూసెక్కులు విడుదల కాగా.. సాయంత్రం శ్రీశైలం రిజర్వాయర్కు 2,05,624 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది.
ఐదు గేట్ల నుంచి 1,39, 915, కుడిగట్టు విద్యుదుత్పత్తి నుంచి 30,839, ఎడమగట్టు విద్యుదుత్పత్తి నుంచి 35,315 క్యూసెక్కులను సాగర్ రిజర్వాయర్కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 884.80 అడుగుల్లో 214.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.