కొల్లాపూర్ రూరల్, ఏప్రిల్ 24: తెలంగాణ ఊటీగా పేరొందిన నల్లమల అటవీ ప్రాంతంలోని అమరగిరి కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని గిరిపుత్రులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లాపూర్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున ప్రకృతి ఒడిలో ఉన్న అమరగిరి చెంచులు, మత్య్సకారులు అధికారుల నిర్లక్ష్యంతో స్వచ్ఛమైన గాలికి దూరం కానున్నారు. కొల్లాపూర్ పట్టణంలో సేకరించిన చెత్తను మున్సిపాలిటీ సిబ్బంది సేకరించిన చెత్తను అమరగిరి వెళ్లే దారిలో డంప్ చేయడంతో ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారాడంతో పాటు దుర్వాసన వెదజల్లుతోందని గ్రామస్తులతో, పర్యాటకులు వాపోతున్నారు. డంప్ చేసిన చెత్తకు నిప్పంటించడంతో కొన్ని రోజులపాటు దట్టమైన పొగ అల్లుకుపోయి ఊపిరి పీల్చుకోలేక పోతున్నామని గిరిపుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందమైన ప్రకృతి అందాలతో ఆకర్శించే అమరగిరి రహదారి అధికారుల నిర్లక్ష్యంతో కాలుష్యం, దుర్వాసన పర్యాటకులకు స్వాగతం పలుకుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పట్టికైనా సంబంధిత అధికారులు స్పందించి డంప్ చేసిన చెత్తను తొలగించి అమరగిరి ప్రకృతి అందాలను కాపాడాలని గ్రామస్తులతో పాటు పర్యాటకులు కోరుతున్నారు.
డంప్ యార్డు గురించి కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ను వివరణ కోరగా అమరగిరి వెళ్లే దారిలో డంప్ యార్డు కోసం రెవెన్యూ వారు స్థలం కేటాయించా రు. పర్యాటకులు, గ్రామస్తులకు ఇబ్బందులు లే కుండా చెత్తను తొలగిచేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఆదేశిస్తే డంప్ యార్డును అక్కడి నుంచి షిప్ట్ చేస్తాం.
– శ్రీనివాసన్, మున్సిపల్ కమిషనర్
తెలంగాణ ఊటీగా పచ్చని చెట్లతో, సెలయేరులతో సహజ సిద్ధమైన అమరగిరి అందాలు అధికారులు నిర్లక్ష్యంతో దెబ్బతింటున్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి దారి పొడువునా సీతాకోక చిలుకలు పర్యాటకులను అలరించేవి కానీ రహదారి పక్కన డంప్ చేసిన చెత్తతో దుర్గందం, పొగతో స్వచ్ఛమైన గాలి కాలుష్యమవుతున్నది. వెంటనే డంప్ యార్డును ఎత్తివేయాలి.
– భరత్ యాదవ్, అమరగిరి