Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 13 రాష్ర్టాల్లోని 89 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 39 శాతం మేర పోలింగ్ నమోదైంది.
అత్యధికంగా త్రిపుర రాష్ట్రంలో 54.47 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ తర్వాత మణిపూర్ రాష్ట్రంలో 54.26 శాతం, ఛత్తీస్గఢ్లో 53.09 శాతం, పశ్చిమ బెంగాల్లో 47.29 శాతం, అస్సోంలో 46.31 శాతం, జమ్మూ కశ్మీర్లో 42.88 శాతం, రాజస్థాన్లో 40.39 శాతం, కేరళలో 39.26 శాతం, మధ్యప్రదేశ్లో 38.96 శాతం, కర్ణాటకలో 38.23 శాతం, ఉత్తరప్రదేశ్లో 35.73 శాతం, బీహార్లో 33.80 శాతం, మహారాష్ట్రలో 31.77 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
Voter turnout till 1 pm for phase 2 of #LokSabhaElections2024
Assam 46.31%
Bihar 33.80%
Chhattisgarh 53.09%
Jammu And Kashmir 42.88%
Karnataka 38.23%
Kerala 39.26%
Madhya Pradesh 38.96%
Maharashtra 31.77%
Manipur 54.26%
Rajasthan 40.39%
Tripura 54.47%
Uttar Pradesh… pic.twitter.com/9Xw5SUf7IB— ANI (@ANI) April 26, 2024
Also Read..
Lok Sabha Pols | ఆసుపత్రి నుంచి వచ్చి ఓటేసిన నారాయణమూర్తి
Kavya Maran | హైదరాబాద్ జట్టు ఘోర పరాజయం.. కావ్య మారన్ రియాక్షన్ వైరల్
Samantha | పెళ్లి గౌనును రీమోడలింగ్ చేయించుకున్న సమంత.. ఎందుకంటే..?