నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
లోకేశ్వరం, జూన్ 7 : పల్లెలను బాగు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని హవర్గ గ్రామాన్ని సందర్శించారు. వీధుల గుండా తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతిరోజూ నిర్దేశించిన షెడ్యూల్ మేరకు పనులు చేపట్టాలన్నారు. పల్లె ప్రగతిలో ప్రభుత్వం నిర్దేశించిన పనులను వందశాతం పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీల ఆవరణల్లో పిచ్చిమొక్కలను తొలగించాల్సిన బాధ్యత గ్రామపంచాయతీలదేనన్నారు.
పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలను సంరక్షించాలని తెలిపారు. గ్రామీణ క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేయాలని, క్రీడా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో లోకేశ్వర్ రావు, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, ఎంపీవో సాల్మాన్ రాజ్, ఈపీ అనిల్ సూపరింటెండెంట్ ఏవీ రమేశ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు భుజంగ్ రావు, కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
తాండ్ర(జీ), కంకెట గ్రామాల్లో..
సారంగాపూర్, జూన్ 7 : మండలంలోని తాండ్ర (జీ), కంకెట గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె పార్కుల పనులు, ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. పల్లెల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైతే గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతాయన్నారు. అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడే, ఇన్చార్జి ఆర్డీవో తుకారం, ఎంపీడీవో సరోజ, ఎంపీవో తిరుపతిరెడ్డి, సర్పంచ్ ఉ మ, ఉప సర్పంచ్ విజయ, గ్రామ ప్రత్యేక అధికారి నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి సౌందర్య, నాయకులు కత్తెరపాక భూమేశ్, అంగన్వాడీ కార్యకర్తలు గోదావరి, సరిత, వనజ పాల్గొన్నారు.