న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్-2020 ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తన అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో ప్రకటించింది. 2021 జనవరి 8 నుంచి 17 వరకు రాతపరీక్ష నిర్వహించారు.
రాత పరీక్షకు హాజరైన, అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ తోపాటు ఇతర సెంట్రల్ సర్వీసెస్ (గ్రూప్ ‘ఏ’ ‘బీ’) ఉద్యోగాల ఎంపికకు తీసుకుంటారు.
Upsc.gov.in హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితం 2020 లింక్పై క్లిక్ చేయడం ద్వారా ఫలితాను వీక్షించవచ్చు.
ఇంటర్వ్యూకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ 2021 మార్చి 25 నుంచి ఏప్రిల్ 5 వరకు అధికారిక వెబ్సైట్లో లభించే వివరణాత్మక దరఖాస్తు ఫారంను నింపి సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థుల పర్సనాలిటీ టెస్టులు (ఇంటర్వ్యూలు) త్వరలో ప్రారంభమవుతాయి. ఇవి న్యూఢిల్లీ షాజహాన్ రోడ్ లోని ధోల్పూర్ హౌస్లో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో జరుగుతాయి.
అభ్యర్థుల ఈ-సమ్మన్ లెటర్స్ ఆఫ్ పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూలు) త్వరలో యూపీఎస్సీ అధికారిక సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
కొవిడ్ నియంత్రణకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
ప్రీపోల్ సర్వేలను చూసి అలసత్వం వద్దు : పినరయి విజయన్
ఫేస్బుక్ కొత్త రిస్ట్బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
మోదీ 115 స్కీంలు తెస్తే.. మమతా 115 స్కాంలు చేశారు : అమిత్షా
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
ఇది యూఎఫ్ఓ కాదు.. రష్యా కార్గో ఎయిర్షిప్..!
ఆర్టిస్ట్ లండన్లో.. మహిళ నెదర్లాండ్స్లో.. 5 జీ టెక్నాలజీ టాటూ
భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఉరితీత.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.