హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఎదురెదురుగా వచ్చిన రెండ్లు కార్లు ఢీకొట్టుకున్నాయి. ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కొడంగల్ శివారులోని బండల ఎల్లమ్మ ఆలయం వద్ద ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న వాహనాన్ని.. ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. మృతులను హైదరాబాద్ యూసుఫ్గూడకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు అబ్దుల్, రషీద్, అమీర్, మౌలానా బేగంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఘటనలో తీవ్రగాయాలు కావడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.