హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుపై రైతులను అప్రమత్తం చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాజెక్టుల కింద వరి సాగుచేయవద్దని రైతులకు సూచించారు. శుక్రవారం ఆయన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజుతో కలిసి కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ని ర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. శనివారం నుంచే సలహామండళ్ల సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వచ్చే వేసవిలో తాగునీటి సంక్షోభం తలెత్తకుండా ఇప్పటినుంచే అవసరమైన నీటి నిల్వలను పరిరక్షించాలని ఆదేశించా రు. నాగర్జునసాగర్, ఎస్సారెస్పీలో నీటినిల్వల పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరం గా ఉన్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల స్మార్ట్ రేషన్కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు.