వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చిన ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ లక్ష్యంగా ఉగ్ర బెదిరింపులు వచ్చినట్లు తాజాగా లీకైన పోలీసు నివేదికలు వెల్లడించాయి. జోర్డాన్తో మ్యాచ్కు ముందు అనామక ఫోన్ కాల్లో బాంబులు, తుపాకీతో స్టేడియంలోకి చొరబడి మెస్సీపై దాడి చేస్తామని బెదిరించినట్లు బయటపడింది. జూలై 7న అట్లాంటాలో ఈజిప్ట్తో జరిగిన మ్యాచ్ సమయంలో తన శరీరానికి నాలుగు బాంబులు కట్టుకుని వచ్చి మెస్సీని పేల్చేస్తానని ఒక వ్యక్తి ఎక్స్లో పోస్ట్ చేయడంతో బాంబ్ డిస్పోజల్ బృందాలు మైదానాన్ని జల్లెడ పట్టాయి. టోర్నీలో మెస్సీనే కాకుండా పోర్చుగల్ లెజెండ్ రొనాల్డో, ఫ్రాన్స్ స్టార్ ఎంబాపెతో పాటు మ్యాచ్ రిఫరీలు కూడా బెదిరింపులను ఎదుర్కొన్నారు. రొనాల్డో బస చేసిన హోటల్లోకి అక్రమంగా చొరబడి అతడితో పాటు లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఫ్రాన్స్ రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్కు ఏకంగా 6 వేలకు పైగా బెదిరింపు వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి. వరల్డ్కప్ సాఫీగా ముగిసినా.. ఇలాంటి బెదిరింపుల వివరాలు బయటకు రావడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి