న్యూఢిల్లీ : ఫ్లయింగ్ సిఖ్గా పేరొందిన.. భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ (91) మరణంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు కేంద్రమంత్రులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. మిల్కాసింగ్ మరణం తనను కలచివేసిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ‘మిల్కా మరణం నా హృదయాన్ని దుఃఖంతో నింపేసింది. జీవితంలో మిల్కా ఎదుర్కొన్న కష్టాలు, ఆయన బలమైన వ్యక్తిత్వం.. భారత్లో అనేక తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. మిల్కా మృతిపై సంతాపం ప్రకటించారు. ‘దేశం అతి విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయింది. కోట్లాది మంది హృదయాల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన వ్యక్తిత్వం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం’ అని ప్రధాని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్షా, క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, పశ్చిమ బెంగాల్, పంజాబ్ అమరిందర్ సింగ్ సైతం మిల్కాసింగ్కు నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.
భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కరోనా అనంతర సమస్యలతో కరోనా అనంతర సమస్యలతో చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 11.30 సమయంలో తుదిశ్వాస విడిచారు. ఇంటి వంట మనుషుల్లో ఒకరు కరోనా పాజిటివ్గా తేలడంతో ఆ వ్యక్తి ద్వారా మే 20వ తేదీన మిల్కాసింగ్కు వైరస్ సోకింది. మే 24న మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. నెగెటివ్ రావడంతో మే 30న డిశ్చార్జి అయినప్పటికీ ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో జూన్ 3న ఆయనను చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్లో చేర్పించారు. ఆయన భార్య, భారత వాలీవాల్ మాజీ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్ సైతం గతవారం కరోనాతో మృతి చెందారు.