ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ రాష్ర్ట ప్రభుత్వం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుతులు, నీటి కేటాయింపులు లేవని లేఖలో పేర్కొన్నారు
రాష్ట్రంలో బోనాలు, బక్రీద్ పండుగలను ప్రశాంతంగా నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.
ఏపీ జలదోపిడీపై తెలంగాణ ప్రభుత్వం పోరాటాన్ని ఉధృతం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తొలిసారిగా జాతీయ హరిత ట్రిబ్యునల్ ( NGT ) చెన్నై ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎల్పీలో సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ కార్యకర్తలను రేవంత్ హింస వైపు ప్రేరేపిస్తున్నారు. రాష్ర్టంలో అల్లకల్లోలం సృష్టించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ పిల్లి కూతలకు, బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరు అని స్పష్టం చేశారు
చేర్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నూతనంగా నిర్మించిన టాయిలెట్స్( సులబ్ కాంప్లెక్స్) నిరుపయోగంగా ఉన్న విషయాన్ని తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సోమవారం దానిని వినియోగంలోకి తీసుకువచ్చారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య నెలకొన్న నీటి వివాదాల నేపథ్యంలో కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ర్ట నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ మరో లేఖ రాశారు. ఈ నెల 9న తలపెట్టిన త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా వేయాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20వ తేదీ తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 2,600 కేజీల మామిడి పండ్లను బహుమతిగా పంపారు. బంగ్లాదేశ్లోని రంగ్పూర్ జిల్లాలో ప్రత్యేకంగా పండించే ‘హరిభాంగా’ రకం మామిడి పండ్లను 260 బాక్సుల్లో ఆ దేశ లారీల్లో రవాణా చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ బుధవారం (ఈ నెల 7) నాడు తన క్యాబినెట్ను విస్తరించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు మోదీ 2.0 ప్రభుత్వంలో తొలిసారి క్యాబినెట్ విస్తరణ కానున్నది. ప్రస్తుతం 28 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దీని ప్రకారం 17-22 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ను దుర్భాషలాడుతూ, చేయి చేసుకున్న 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేశారు. సోమవారమే మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ గొడవ సమయంలో అసెంబ్లీలోనే ఉన్న ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు.
అమెజాన్కు కొత్త సీఈవో వచ్చారు. ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ సోమవారం ఆ పదవి నుంచి తప్పుకొని ఆండీ జాసీకి అప్పగించారు. గతంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) హెడ్గా పని చేసిన జాసీ.. ఆ సంస్థలో ఈ స్థాయికి ఎదిగిన తీరు అద్భుతమే. 1994లో తన గ్యారేజ్లో అమెజాన్ సంస్థను ప్రారంభించిన బెజోస్ 27 ఏళ్లలో ఆ సంస్థను ఎవరూ ఊహించని స్థాయికి తీసుకెళ్లారు.
అమెరికా ఐటీ సంస్థ కసేయాపై గత శుక్రవారం సైబర్ దాడి జరిగింది. రాన్సమ్వేర్ దాడితో వందలాది వ్యాపార సంస్థల కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అమెరికాతో పాటు మొత్తం 17 దేశాలపై సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన ఈవిల్ గ్యాంగ్ ఆ సైబర్ అటాక్కు పాల్పడింది. తాజాగా జరిగిన సైబర్ దాడి విషయంలో ఈవిల్ గ్యాంగ్ తమ డార్క్ వెబ్సైట్లో హ్యాపీ బ్లాగ్లో 520 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.