మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలనే ప్రజలు అనుభవిస్తున్నారు. 2019లో కేసీఆర్ ఆశీర్వాదంతో, ఎమ్మెల్యేల కృషితో ఎంపీగా గెలుపొందాను. బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు ఉన్న సమయంలో వెంట ఉండి.. కష్టకాలంలో పార్టీని వీడిపోరాదని కేసీఆర్ సూచనల మేరకు మళ్లీ బరిలో నిలిచాను. ప్రతి విషయంలో మీకు అందుబాటులో ఉంటాను. ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కరించేందుకు కృషి చేస్తాను.
నీళ్లు. కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది ఎంపీలు తెలంగాణకు చెందిన ఎన్నో అంశాలను ప్రస్తావించాం. కాని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఎంపీలు ఏనాడూ మన సమస్యలపై గళమెత్తలేదు. కేసీఆర్ కృషితో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 శాతం పనులు పూర్తయ్యాయి. రాష్ట్రం రాకముందు, వచ్చాక ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు.