మాగనూరు, ఏప్రిల్ 28 : ఈతవనం దగ్ధమైన ఘ టన మండలంలోని బైరంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. గీత కార్మికుల కథనం మేరకు.. భై రంపల్లి, నేరడుగం శివారులోని ఈతవనాన్ని ఎవరో ఉద్దేశపూర్వకంగానే దగ్ధం చేశారు. కల్లుగొబ్బలను ధ్వంసం చేసిన ఘటనపై నారాయణపేట ఆబారీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో రెండువేలకు పైగా ఈతచెట్లు కాలి బూడిదయ్యాయన్నారు. కల్లు అమ్ము తూ చాలా గౌడ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయ న్నారు. ఇప్పుడు వారంతా రోడ్డున పడే అవకాశం ఉందని వాపోయారు. కొన్ని రోజుల కిందట ఇలాగే నిప్పుపెట్టగా గమనించి మంటలను ఆర్పి కొన్ని చె ట్లను కాపాడుకోగలిగామన్నారు. మళ్లీ ఇప్పుడు అట్లే చేశారన్నారు. ఈ ఘటనకు కారకులను శిక్షించి తమ కు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.