గజ్వేల్, ఏప్రిల్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అన్నారు. సోమవారం పట్టణంలోని కోటమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఒకటో వార్డులో కౌన్సిలర్ బొగ్గుల చందుతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సంద ర్భంగా రాజమౌళి మాట్లాడుతూ నాలుగు నెలల్లోనే ప్రజలకు దగ్గరవడంలో ప్రభుత్వం విఫలమయిందని, ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నదన్నారు. గజ్వేల్లో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నదన్నారు. కోట్లాది రూపాయల నిధులతో గజ్వేల్ను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారన్నా రు. వైస్ చైర్మన్ జకియొద్దీన్, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు బాలమణి, మెట్టయ్య, దుర్గాప్రసాద్, రహీం, కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, ఉమార్, వార్డు అధ్యక్షుడు స్వామి, నాయకులు నర్సింగరావు, స్వామిచారి, కుమార్, కరీమొద్దీన్, కరీం పాల్గొన్నారు.
ములుగు, ఏప్రిల్ 29: కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసపూరిత వాగ్ధానాలను ప్రజలు విశ్వసించొద్దని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మండలంలోని నర్సాపూర్ గ్రామంలో మండల నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగితూ కారుగుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జహంగీర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అర్జున్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రాజేందర్రెడ్డి, బాపురెడ్డి ఉన్నారు.
గజ్వేల్, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష అని, కేసీఆర్ అంటేనే ప్రజలకు నమ్మకం, భరోసా ఉంటుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని దాచారంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. నేతలు పార్టీలు మారినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్తోనే ఉన్నారన్నారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ వెంకటేశంగౌడ్, జడ్పీటీసీ మల్లే శం, వైస్ఎంపీపీ కృష్ణగౌడ్, మండల సమన్వ య కమిటీ సభ్యులు శ్రీనివాస్రెడ్డి, దయాకర్రెడ్డి, రవీందర్రెడ్డి, చిన్నమల్లయ్య, రాంరెడ్డి, రమేశ్గౌడ్, నర్సింహులు, అశోక్రావు, ప్రతాప్రెడ్డి, సందీప్రెడ్డి, శివకుమార్, మోహన్బాబు, వెంకటేశ్, బాలునర్సులు పాల్గొన్నారు.
జగదేవ్పూర్, ఏప్రిల్ 29: పల్లెల అభివృద్ధి, పేదల సంక్షేమం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని తీగుల్నర్సాపూర్, అంతాయగూడెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈజీఎస్ కూలీలతో ముచ్చటిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని, వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని సూచించారు. ఇంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, జగదేవ్పూర్ ఎంపీటీసీ కవిత, మండల కోఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, దుర్గయ్య, సత్యం, స్వామి, కనకయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.
బెజ్జంకి, ఏప్రిల్ 29: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్కు మద్దతుగా మండలంలోని గాగిల్లాపూర్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనుల వద్దకెళ్లి ఎంపీగా వినోద్కుమార్ చేసిన అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పాలనతో ప్రజలకుపడుతున్న అవస్థలను వివరించారు. ఎంపీ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ కారుగుర్తుకు ఓటువేయాలని కోరారు. ప్రచారం చేసిన వారిలో మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, లక్ష్మణ్, వెంకటేశ్ తదితరులున్నారు.