కమాన్చౌరస్తా, ఏప్రిల్ 25 : కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల (ఎస్వీజేసీ) విద్యార్థులు గురువారం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయదుందుభి మోగించారు. అందులో బీ రాహుల్ 91.6, జీ సాత్విక్ 90.8, షేక్ షాహిద్ 79.4, ఈ రమ 74.1, బీ అభిలాష్ 72.2 పర్సంటైల్తో విజయకేతనం ఎగురవేశారు.
కళాశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్ విక్టర్ లారెన్స్ గైఫ్ని, హైకోర్టు లాయర్ కావేటి శ్రీనివాస్ విద్యార్థులను, వారి తలిదండ్రులను సతరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, వరప్రసాద్, రాంరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగళ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.