హైదరాబాద్ : అన్ని వర్గాల ప్రజల మద్దతు బీఆర్ఎస్(BRS) పార్టీకే ఉందని సికింద్రాబాద్ పార్లమెంట్ (Parliament elections) బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్(Padmarao Goud )అన్నారు. ఆదివారం ఆయన సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి పద్మారావు నగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాల యాన్నిప్రారంభించారు. ముందుగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడికి వెళ్లినా ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ తమ ప్రేమాభిమానాలను చాటుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. తన గెలుపు కోసం తీవ్రమైన ఎండలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అద్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బన్సీలాల్ పేట కార్పొరేటర్ కుర్మ హేమలత లక్ష్మీపతి, డివిజన్బీ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, పద్మారావు నగర్ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, నాయకులు ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి, పుష్యంత్ రెడ్డి, రమణ, ముక్కా శ్రీనివాస్, అమృత, అనిత, కౌసల్య, దుర్గ తదితరులు పాల్గొన్నారు.