వీర్నపల్లి, మే 4: ఒకరేమో దేవుళ్లపై ఒట్లు వేసి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలం గడుపుతుంటే.. మరొకరేమో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని.. అలాంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన తెలంగాణ భవన్లో తంగళ్లపల్లి, వీర్నపల్లిలో మండల ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వీర్నపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, పెట్రోల్, డీజీల్ ధరలపై సెస్ రూపంలో రూ.30లక్షల కోట్లు వసూలు చేసి మోదీ ప్రభుత్వం.. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు రూ.14లక్షల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. తాను చేస్తున్న ఆరోపణలు తప్పని బండి సంజయ్ నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దేశంలో పదేళ్ల మోదీ పాలనపై ప్రజలు విసుగు చెందారన్నారు. ఆయన హిందూ, ముస్లింల పేరుతో ఓట్లు దండుకొని మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలిపారు.
వీర్నపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, తండాలను జీపీలుగా మార్చామని గుర్తు చేశారు. ఐదేళ్లలో ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి నిధులు తేలేదన్నారు. దత్తత తీసుకొని వీర్నపల్లి గ్రామ రూపురేఖలు మార్చిన వినోద్కుమార్కు భారీ మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం బీఎస్పీకి చెందిన సుమారు 60మంది యువకులకు కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఇక్కడ నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ గుగులోత్ కళావతి, ఎంపీపీ మాలోత్ భూల, సెస్ డైరెక్టర్ మాడ్గుల మల్లేశం, జడ్పీ కో అప్షన్ సభ్యుడు చాంద్పాషా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, ఆర్బీఎస్ మాజీ మండలాధ్యక్షుడు ఎడ్ల సాగర్, వైస్ ఎంపీపీ ఈసంపల్లి హేమ, బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ సురేశ్నాయక్, యువజన విభాగం మండలాధ్యక్షుడు సామల్ల దేవరాజు, నేతలు శ్రీరాంనాయక్, రఫీ, రవి, భాస్కర్, తిరుపతిరెడ్డి, రాజేశ్బాబు, చంద్రం, లింగం, మల్లేశం, దేవరాజు, తదితరులు ఉన్నారు.
సిరిసిల్ల రూరల్, మే 4: జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. బీఎస్పీ మండలాధ్యక్షుడు గుండు ప్రేమ్కుమార్, జిల్లా ఈసీ మెం బర్ శ్యాగ యాదగిరి ఆధ్వర్యంలో వంద మందికిపైగా నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, అరచేతిలో వైకుంఠం చూపించి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్తో ఐదు నెలల్లోనే ప్రజలను అవస్థలు పడుతున్నారన్నారు. సిగ్గులేకుండా నిన్నటి సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేశామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలను గోసపెడుతున్నారని మండిపడ్డారు.
పార్టీలో చేరిన బీఎస్పీ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ నెల 10న సిరిసిల్లలో నిర్వహించే కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, ఎంపీపీ పడిగెల మాన స, పీఏసీఎస్ చైర్మన్ బండి దేవదాస్గౌడ్, ప్రముఖ న్యాయవాది ఆవునూరి రమాకాంతారావు, నాయకులు పూసపల్లి సరస్వతి, మాట్ల మధు, మీరాల భాస్కర్ యాదవ్, కోడి అంతయ్య, శ్యాగ దేవేందర్, కర్నె బాలయ్య, కుర్మ రాజయ్య, ఎండీ తాజొద్దీన్, సిలువేరి చిరంజీవి, గుండు ప్రేమ్కుమార్, శ్యాగ యాదగిరి, దాసరి ఆనందం, ఏసీరెడ్డి రాం రెడ్డి, ఏనుగు రాజేశ్వర్రావు, గనప శివజ్యోతి, కోడం సంధ్యారాణి, రామలక్ష్మి, రోజా, బల్లెపు సిద్ధన్న, అబ్బాడి అనిల్రెడ్డి ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల, మే 3 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సిరిసిల్ల పట్టణంలో ప్రచారం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మండుటెండను సైతం లెక్క చేయకుండా కార్య కర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ప్రతి ఒక్కరినీ అప్యాయంగా పలుకరిస్తూ, యోగక్షే మాలు అడిగి తెలుసుకున్నారు. కారు గుర్తుకే ఓటు వేసి వినోదన్నను గెలిపించాలని అభ్యర్థించారు. ఉదయం ఆరు గంటలకు రైతుబజార్, కూరగాయ ల మార్కెట్లోని రైతులను కలిసి ఓటు అభ్యర్థిం చారు. గాంధీచౌక్ నుంచి ప్రచారం చేస్తూ లేబర్ అడ్డా వద్దకు చేరుకున్నారు. పాతబస్టాండ్లో పూలు, పండ్లు అమ్మే వ్యాపారులను సైతం కలిసి ఓటు అభ్యర్థించారు. బస్టాండ్లో ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు.