అమరావతి : ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) , తనయుడు లోకేష్ (Lokesh) తో పాటు మరో 10 మందిపై సీఐడీ(CID) పోలీసులు కేసు నమోదు చేశారు. ఐవీఆర్ఎస్ (IVRS) కాల్స్ చేసిన ఏజెన్సీపైనా కూడా కేసు నమోదు చేశారు. ఆదివారం సీఐడీ బృందం సభ్యులు విజయవాడ టీడీపీ ఆపీసుకు వెళ్లి ఆఫీసు ఇన్చార్జి అశోక్బాబుకు నోటీసులు అందజేసి, రేపు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది .
ల్యాండ్ టైటిలింగ్(Land Titiling) పై టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారంపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే(MLA) మల్లాది విష్ణు ఏప్రిల్ 29న ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును పరిశీలించిన ఈసీ ఆదేశాల మేరకు సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టింది . ఈ కేసులో చంద్రబాబును ఏ1 గా, ఏ2 గా లోకేష్ పేరును చేర్చింది . మరో 10 మందిపై కేసు నమోదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో ఐవీఆర్ఎస్ కాల్స్తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆక్షేపిస్తూ తగన ఆధారాలను ఈసీకి సమర్పించింది.