హన్వాడ, జూలై 30 : ధాన్యంలో అవకతవకలకు పాల్పడినందుకు గాను మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహింబాద్ సమీపంలోని శ్రీలక్ష్మీ బాలాజీ రైస్మిల్, ఫుడ్ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్పై గురువారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ సిటీ-2 యూనిట్ అధికారులు, జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు బుధవారం ఈ మిల్లులో తనిఖీలు చేపట్టారు. యాసంగి 2022-23 సీజన్కు సంబంధించిన 5,070.88 టన్నుల (1,26,772 బస్తాల) ధాన్యం కొరత ఉన్నట్టు గుర్తించారు.
సుమారు రూ.11.34 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం తక్కువగా ఉన్నదని, రూ.14.84 లక్షల విలువైన సీఎంఆర్ అనుమతులు లేకుండా ఏపీకి తరలిస్తున్న రెండు లారీలను మిల్లు సమీపంలో గుర్తించారు. మిల్ యాజమాన్యం ఈ-వే బిల్లులు రూపొందించినప్పటికీ సివిల్ సప్లయ్ శాఖ నుంచి అవసరమైన అనుమతులు పొందలేదు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం మిల్పై కేసు నమోదు చేశారు.