ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 30 : పది ఫలితాల్లో ఖమ్మం జిల్లా ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. గత సంవత్సరంతో పోలిస్తే నాలుగు శాతం పెరిగింది. పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జిల్లా వ్యా ప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 16,541 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో బాలురు 8,521మంది, బాలి కలు 8,020 మంది పరీ క్షలు రాశారు. వీరిలో బాలురు 7,714 మంది ఉత్తీ ర్ణులై 90.53 శాతం నమోదు చేశారు. బాలికలు 7,544 మంది ఉత్తీర్ణులై 94.06శాతం నమోదు చేశారు. మొత్తం 15,258 మంది ఉత్తీర్ణులై 92.24 శాతాన్ని నమోదు చేశారు. రాష్ట్ర సగటు 91.31 ఉత్తీర్ణతతో పోలీసే ్త జిలా ్ల ఉతీ ర్తత్ణ ఒక శాత0 అధికంగా ఉంది. జిల్లా ఉత్తీర్ణత స్థానంలో 21వ స్థానంలో నిలిచింది. గ్రేడ్-ఏ1 పది పాయింట్లు, ఏ2 తొమ్మిది పాయింట్లు, బీ-1 ఎని మిది పాయింట్లు, బీ-2 ఏడు పాయింట్లు, సీ-1 ఆరు పాయింట్లు, సీ-2 ఐదు పాయింట్లు, డీకి నాలుగు పాయింట్లుగా విద్యా శాఖాధికారులు విభజించారు. ఇప్పటి వరకు ఏ ఫలితాల్లోనైనా ప్రతి సంవ త్సరం బాలి కలే పై చేయి సాధిస్తూ వచ్చారు.
జిల్లా విద్యా శాఖ పరి స్థి తిని మెరు గు ప రి చేం దుకు జిల్లా విద్యా శా ఖా ధి కారి సోమ శే ఖ ర శర్మ, కలె క్టర్ వీపీ గౌతమ్ ఎప్ప టి క ప్పుడు సమీ క్షలు చేస్తూ అభివృ ద్ధికి కృషి చే శారు. అవ కాశం ఉన్న అంశా లను సద్వి ని యో గ ప ర్చు కుంటూ విద్యా రు ల్థ ను మెరి కల్లా తీర్చి ది ద్ద డంలో ప్రధాన భూమిక పోషిం చారు. ప్రైవేటు పాఠ శా లలు ఎప్ప టి లా గానే పది కి ప దికి గ్రేడింగ్ పాయింట్లు సాధించి తమ హవాను మరో సారి కొన సా గిం చాయి.
విద్యార్థులు ఫెయిలైన వారిలో అత్యధిక మంది సైన్స్ సబ్జెక్ట్ లోనే ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా ఒక్క సబ్జెక్ట్ ఫెయి లైన వారిలో సైన్స్ విద్యార్థులే ఎక్కువ. అత్యధికంగా హిందీలో ఎక్కువ ఉత్తీర్ణత సాధించగా, తెలుగులో 535 మంది, ఇంగ్లిష్లో 267 మంది, గణితంలో 240 మంది, సోషల్లో 90 మంది ఫెయిలయ్యారు.
జిల్లాలో 294 మందికి టెన్ జీపీఏ సాధిం చారు. బీసీ వెల్పేర్ పాఠశాలల్లో ఆరుగురు, మోడల్ స్కూల్స్లో ఒకరికి, ప్రైవేట్ స్కూల్స్లో 278 మందికి రెసి డెన్సియల్ పాఠశాలల్లో ముగ్గురికి, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇద్దరికి టెన్ జీపీఏతో రాణించారు. అత్యుత్త మంగా ట్రైబల్ వేల్పేర్, రెసి డెన్షియల్ పాఠశాలల్లో 98శాతం కి పైగా ఉత్తీర్ణత సాధించారు.