Prasanth Varma | ‘హను-మాన్’తో పాన్ఇండియా డైరెక్టర్గా అవతరించారు ప్రశాంత్వర్మ. ‘హను-మాన్’కి సీక్వెల్గా ‘జై హనుమాన్’ను కూడా ప్రకటించారాయన. స్టార్లు ఇందులో భాగం కానున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. ఆ మధ్య ఈ సినిమా స్క్రిప్ట్కి పూజ కూడా నిర్వహించారు. అయితే ‘జై హనుమాన్’ ఎవరితో తీస్తారనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇదిలావుంటే.. కొన్ని రోజుల క్రితం ప్రశాంత్వర్మ ముంబయ్లో రణవీర్సింగ్ని కలిశారు. దాంతో మళ్లీ ‘జై హనుమాన్’ చర్చ ఊపందుకుంది.
రణవీర్సింగ్, ప్రశాంత్వర్మ కాంబినేషన్లో మూవీ అంటూ బీటౌన్లో వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే.. వీరిద్దరి సినిమా ఆల్రెడీ మొదలైందట. ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ జరుగుతుందనేది విశ్వసనీయ సమాచారం. అయితే.. ఇది ‘జై హనుమాన్’ కాదని తెలుస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ కూడా వినిపిస్తుంది. జరుగుతున్న షూట్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ని తనదైన మార్క్తో ప్రేక్షకులకు అందించాలనే ప్లాన్లో ఉన్నాడట ప్రశాంత్వర్మ. ఈ గ్లిప్స్ని అతిత్వరలోనే రిలీజ్ చేస్తారని తెలుస్తున్నది. ఈ గ్లింప్స్ విడుదలైతే గానీ ఇది ఏ తరహా సినిమానో తెలియదు.