Telangana Assembly | హైదరాబాద్ : విరామం అనంతరం ప్రారంభమైన శాసనసభలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. లగచర్ల రైతులను విడుదల చేయాలని, ఈ అంశంపై చర్చకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. కానీ స్పీకర్ చర్చకు అనుమతించలేదు. సభ్యుల ఆందోళనల మధ్యనే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులను సంబంధిత మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. ఇక ఈ బిల్లులపై ఎలాంటి చర్చ చేపట్టకుండా.. శాసనసభ ఆమోదం తెలిపింది. మూడు బిల్లులకు ఆమోదం అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. పర్యాటక రంగంపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. అయితే లగచర్ల రైతులను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఇదేమీ రాజ్యం.. ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలతో హోరెత్తించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
ఇవి కూడా చదవండి..
BRS MLCs | లగచర్ల ఘటనపై చర్చకు బీఆర్ఎస్ పట్టు.. మండలి రేపటికి వాయిదా