‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో ఆంగ్ల బోధనకు శ్రీకారం చుడుతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా 1,258 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా, మొదటి విడుతలో 400కు పైగా విద్యాలయాల్లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. త్వరలో ఆయా స్కూళ్లలో 11 అంశాలపై సర్వే నిర్వహించి, ఆ రిపోర్టు ఆధారంగా వాటిల్లో మౌలిక వసతులు కల్పించనున్నది. ఇక పూర్వ విద్యార్థులు, దాతలు అందించే నిధులను బట్టి తరగతి గదులు, బ్లాక్లకు వారి పేర్లు పెట్టనున్నట్లు నిర్ణయించింది.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ)
రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి అందుకనుగుణంగా సకల సౌకర్యాలు కల్పించేందుకు చర్య లు చేపడుతున్నది. ఈ మేరకు జిల్లాకు ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని.. ఆ మండలంలోని 33 శాతం పాఠశాలలను ఎంపిక చేయనుంది. ప్రాథమిక పాఠశాలల్లో 33 శాతం, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 33 శాతం, ఉన్నత పాఠశాలల్లో 33 శాతం పాఠశాలలను గుర్తించనున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎంపిక చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1258 ప్రాథమి క, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నా యి. ఇందులో మొదటి విడుతగా 400కు పైగా విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానం గా 11 అంశాల ఆధారంగా ఆయా పాఠశాలల్లో సర్వే నిర్వహించనున్నారు. మరుగుదొడ్లు, తాగునీరు, సైన్స్ ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్ లు, గ్రంథాలయాలు, ప్రహరీలు, వంటగదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు కావాల్సిన వసతు లు, ఫర్నిచర్, పాఠశాలల స్థితిగతులు, భోజనశాలలు, డిజిటల్ విద్యకు కావాల్సిన మౌలిక వసతులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సర్వే చేపట్టనున్నారు. ఆ సర్వే రిపోర్టు ఆధారంగా ఎంపికైన పాఠశాలల్లో ఆంగ్ల విద్య అమలుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించనున్నారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల విద్య అమలుకు కావాల్సిన వసతులు అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా సమకూరనున్నాయి. ఆంగ్ల విద్య అమలును ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా తీసుకోవడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుం డా అన్ని విధాలా వనరులను సమకూర్చనున్నా రు. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీపీ లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, పాఠశాలల యాజమాన్య కమిటీలు, ఆయా గ్రామాల్లో ఉన్న పాఠశాలల స్థితిగతులను బట్టి ఆంగ్ల విద్య అమలుకు కావాల్సిన వసతులు గుర్తించి ప్రణాళికలు తయారు చేయనున్నారు. వసతుల కల్పనకు ప్ర భుత్వం నుంచి వచ్చే నిధుల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా, దాతలు ఇచ్చే విరాళాల సేకరణకు మరో ఖాతా తెరవనున్నారు.
పాఠశాలల పూర్వ విద్యార్థులు, దాతల నుంచి వచ్చే నిధులను పాఠశాల అభివృద్ధికి వినియోగించనున్నారు. రూ. 10 లక్షలు ఎవరైనా విరాళం ఇస్తే ఒక తరగతి గదికి దాత సూచించిన పేరు, రూ.25 లక్షలు ఇస్తే పాఠశాలలో ఒక బ్లాక్కు అత ను సూచించిన పేరు, రూ.కోటి లేక పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కావాల్సిన విరాళం ఇస్తే ఆ పాఠశాలకు దాత సూచించిన పేరు పెట్టనున్నారు. అధికారుల పర్యవేక్షణతోపాటు ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణలో ఇంగ్లిష్ మీడి యం అమలుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయోలేదో గుర్తించేందుకు త్వరలోనే సర్వే ప్రారంభం కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో విద్యావిధానంలో అనూనుహ్య మార్పులు రానున్నాయి.