Stock Market | ముంబై, మే 3: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. టెలికం, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ రంగ షేర్లలో క్రయవిక్రయాలు అధికంగా జరగడంతో రికార్డు స్థాయిలో దూసుకుపోయిన సూచీలు అంతేస్థాయిలో వెనక్కితగ్గాయి. ఇంట్రాడేలో 75 వేల మార్క్ను అధిగమించిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 732.96 పాయింట్ల నష్టంతో 73,878.15 వద్ద స్థిరపడింది. కనిష్ఠ స్థాయి నుంచి1,627 పాయింట్ల శ్రేణిలో సూచీ కదలాడింది. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు మార్కెట్లను పడేశాయి. సూచీలో హెవీవెయిటేజ్ అయిన ఈ మూడు షేర్లు నష్టాల్లోకి జారుకోవడం సూచీలు నష్టపోవడానికి ప్రధాన కారణమని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఒక దశలో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్న ఎన్ఎస్ఈ నిఫ్టీ 172.35 పాయింట్లు కోల్పోయి 22,475. 85 వద్ద స్థిరపడింది. దీంతో లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. సూచీల్లో ప్రాఫి ట్ బుకింగ్ జరగడంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.2, 25,543.41 కోట్లు కరిగిపోయి రూ.4,06,24,224. 49 కోట్లు(4.89 ట్రిలియన్ డాలర్లు) వద్ద నిలిచింది.