Loksabha Elections 2024 : భారత్లో ప్రస్తుతం ముస్లింల పరిస్ధితి హిట్లర్ హయాంలో యూధుల పరిస్ధితిలా ఉందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ తిరువనంతపురం అభ్యర్ధి శశి థరూర్ స్పందించారు.
గత కొన్నేండ్లుగా దేశంలో ముస్లింలకు ఎదురైన అనుభవాలు మంచివి కాదని వ్యాఖ్యానించారు. దేశంలో ఇలా తొలిసారి జరుగుతోందని, లోక్సభ, రాజ్యసభలో కాషాయ పార్టీ నుంచి ఒక్క ముస్లిం లేరని, క్యాబినెట్లో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది బీజేపీ చేసిన తప్పిదమే అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో దేశం మొత్తం ప్రతిబింబించేదని, అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం ఉండేదని గుర్తుచేసుకున్నారు. కానీ కాషాయ పాలకులు హింద్, హిందూ, హిందుత్వ నినాదాలతో దేశ గుర్తింపును మార్చాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇది మంచి పద్ధతి కాదని శశి థరూర్ హితవు పలికారు.
Read More :
TS ECET | మే 6న ఈసెట్ ప్రవేశ పరీక్ష.. ఒక్క నిమిషం నిబంధన అమలు