TS ECET | హైదరాబాద్ : టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందే ఎగ్జామ్ సెంటర్ల వద్దకు చేరుకోవాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను ఎగ్జామ్ హాల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలని, ఆ తర్వాతే ఎగ్జామ్ హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.
గుర్తింపు కార్డు కింద ఆధార్ కార్డు, కాలేజీ ఐడీ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని చూపించాల్సి ఉంటుంది. క్యాలికులేటర్స్, లాగ్ టేబుల్స్, సెల్ ఫోన్లు, డిజిటల్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ఈ పరీక్ష కోసం మొత్తం 99 కేంద్రాలను ఏర్పాటు చేయగా, తెలంగాణ జిల్లాల్లో 48, హైదరాబాద్ రిజీయన్లో 44, ఏపీలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24,272 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.