Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో తొలి మూడు దశల పోలింగ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీకి పరిస్ధితి అర్ధమైందని ఎన్సీపీ-ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. మూడు దశల పోలింగ్లో ప్రతికూల పవనాలను మోదీ పసిగట్టారని అందుకే ఆయన ప్రచార పర్వంలో మార్పు కనిపిస్తోందని చెప్పారు.
మహారాష్ట్రలో ఎంవీఏ కూటమికి 30 నుంచి 35 స్ధానాలు లభిస్తాయని పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని సతారాలో పవార్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లోక్సభ పోరులో కాషాయ పార్టీకి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు.
లోక్సభ ఎన్నికల్లో ఎంవీఏ అభ్యర్ధులు మంచి మెజారిటీతో ఘన విజయం సాధిస్తారని పేర్కొన్నారు. కాషాయ కూటమికి ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. మత రాజకీయాలతో బీజేపీ దేశ ప్రజల్లో విభజన వాదాన్ని లేవనెత్తుతోందని పవార్ దుయ్యబట్టారు.
Read More :
Ranveer Singh | ఇన్స్టాగ్రామ్ నుంచిపెళ్లి ఫొటోలు డిలీట్.. వారి బంధంపై మళ్లీ మొదలైన అనుమానాలు