Cancer | న్యూఢిల్లీ: చేతి వేళ్ల గోళ్ల పై భాగంలో తెల్లని లేదా ఎర్రని చారలు ఉంటే క్యాన్సర్ వృద్ధి చెందుతున్నదని చెప్పవచ్చునని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ చారలతో గోరు దళసరిగా మారుతుందని తెలిపింది. చర్మం, కళ్లు, మూత్ర పిండాల క్యాన్సర్ల ట్యూమర్లు వృద్ధి చెందుతున్నాయని చెప్పడానికి ఇవి సంకేతాలని తెలిపింది. అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఈ అధ్యయనం ప్రకారం, గోళ్ల పై భాగంలో తెలుపు లేదా ఎరుపు రంగులో చారలు ఏర్పడే పరిస్థితి క్రమంగా అరుదైన వారసత్వ అస్వస్థత బీఏపీ1కు దారి తీయవచ్చు. క్యాన్సరస్ ట్యూమర్ల ముప్పు పెరగవచ్చు. ఈ చారలు కేవలం ఒక గోటిపైన మాత్రమే ఏర్పడతాయి. అయితే ఈ అధ్యయనంలో బీఏపీ1 సిండ్రోమ్ గల వ్యక్తులు 47 మంది పాల్గొన్నారు.