Hyderabad | హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు వన్వే ట్రాఫిక్ విధానం ఆగస్టు 8 నుంచి అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు కేబీఆర్ పార్క్ వాకర్లతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బహిరంగ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, ఐపీఎస్, ట్రాఫిక్ డీసీపీ-2 కాజల్, ఐపీఎస్తో పాటు పలువురు ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆగస్టు 18 నుంచి అమల్లోకి రానున్న నూతన ట్రాఫిక్ మార్పులపై వాకర్లకు అధికారులు వివరించారు. కొత్త ట్రాఫిక్ విధానం సులభంగా, క్రమబద్ధంగా అమలయ్యేందుకు పార్క్ సందర్శకులు, వాహనదారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
నూతన ట్రాఫిక్ నిబంధనలపై కేబీఆర్ పార్క్ వాకర్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు పార్క్ ముందు క్యూఆర్ కోడ్ను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రాకపోకలు సురక్షితంగా, వేగంగా జరిగేందుకు పౌరులు, ముఖ్యంగా నిత్యం కేబీఆర్ పార్క్కు వచ్చే సందర్శకులు నూతన ట్రాఫిక్ మార్పులకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
– జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్, హైదరాబాద్