రియాద్ : సౌదీ అరేబియా అన్ని ప్రయాణ పరిమితులను తొలగించింది. అంతర్జాతీయ విమానాలను ప్రారంభించింది. సరిహద్దులను కూడా తెరిచింది. ఈ రోజు నుంచే ఇవన్నీ అమలులోకి వస్తాయని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో వైరస్ను కట్టడి చేసేందుకు గత ఏడాది మార్చి నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలను సౌదీ అరేబియా నిషేధించింది. అయితే ఇప్పుడిప్పుడే వైరస్ తగ్గుముఖం పడుతుండటంతోపాటు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రమాణ పరిమితులపై ఉన్న నిషేధాలను ఎత్తివేసింది. దీంతోపాటు భూమి, సముద్ర సరిహద్దులను కూడా తెరిచింది. ఉపశమన చర్యలతోపాటు కొన్ని షరతులు కూడా విధించింది. ప్రస్తుతానికి భారత్తో పాటు లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీకి ప్రత్యక్ష లేదా పరోక్ష విమానాలు నిషేధించనున్నారు.
సౌదీ అరేబియా జనాభా 30 మిలియన్లు. వీరిలో ఎక్కువ మొత్తం జనాభాకు కనీసం ఒక డోసు టీకా ఇచ్చారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం, ప్రయాణానికి రెండు వారాల ముందుగానే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. రాబోయే విమానాల్లో యూఎస్, యూకే, ఫ్రాన్స్ సహా 20 దేశాల పౌరులపై నిషేధం కొనసాగుతుంది.
మే 20 నుంచి వచ్చే ప్రయాణికులపై సౌదీ అరేబియా సంస్థాగత నిర్బంధాన్ని విధించనున్నది. సౌదీ పౌరులు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలతో పాటు కొన్ని వర్గాల ప్రయాణికులు దిగ్బంధం నుంచి మినహాయింపు పొందుతారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణీకులతో పాటు అధికారిక ప్రతినిధుల బృందాలతో పాటు దౌత్యవేత్తలు, వారి కుటుంబాలను కూడా దిగ్బంధం నుంచి మినహాయించారు.
ప్రయాణ పరిమితులు ఎత్తివేయడంతో విమాన సర్వీసులను నడిపేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. 28 దేశీయ, 43 అంతర్జాతీయ గమ్యస్థానాలతో పాటు 71 విమానాశ్రయాల నుంచి 71 గమ్యస్థానాలకు విమానాలను నడిపేందుకు సన్నాహాలు పూర్తి చేసినట్లు సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ తెలిపింది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విమానాశ్రయాలలో సుమారు 385 విమానాలు నడుస్తాయని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.
అయితే, సౌదీ అరేబియా ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా ప్రత్యక్షంగా లేదా మరొక దేశం ద్వారా కొవిడ్ ప్రభావిత దేశాలకు వెళ్లడాన్ని ఇప్పటికీ నిషేధించింది. ఈ దేశాలలో భారతదేశం, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మేనియా, సోమాలియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆఫ్ఘనిస్తాన్, వెనిజులా, బెలారస్ దేశాలు ఉన్నాయి.
వచ్చే ఏడాదికల్లా మార్కెట్లోకి హీరో ఎలక్ట్రిక్ బైక్
పూరీ జగన్నాథుడి చందన్యాత్ర ప్రారంభం
అధిక రక్తపోటు.. చేయాల్సినవి.. చేయకూడనివి
శ్రీలంక క్రికెట్లో వివాదం: ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత
భద్రంగా అజ్మీర్లోని ఇజ్రాయెల్ మందిరం
24 మందితో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. చరిత్రలో ఈ రోజు
అమెరికా ఉద్యోగం కన్నా పాడిలో నాలుగింతలు ఎక్కువ సంపాదన : కిషోర్ మంత్రం
గంగా నది ఇసుకలో సమాధులు.. వెలికితీసిన వరుణుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..