భువనేశ్వర్ : పూరీ జగన్నాథుడి రథ యాత్ర కోసం నరేంద్ర సరోవర్ నుంచి 21 రోజు చందన్ యాత్ర సోమవారం ప్రారంభమైంది. రథాల నిర్మాణానికి పూజలు నిర్వహించిన తర్వాత రథల పనులు ప్రారంభమయ్యాయి.
ఒడిశాలోని పూరీలోని నరేంద్ర సరోవర్ నుంచి 21 రోజుల చందన్ యాత్ర వైభవంగా సోమవారం ప్రారంభమైంది. దీంతో జగన్నాథ రథ యాత్రకు రథాల నిర్మాణం కూడా మొదలైంది. ఆలయ ఆచారాలు ప్రకారం రథాల నిర్మాణంలో నిమగ్నమైన పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథాలను నిర్మించేందుకు అనుమతించారు.
రథయాత్రతో సంబంధం ఉన్న అర్చకులు, పూజారులు, సేవకుల జాబితాను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. వీరికి సోమవారం నుంచే కరోనాతో టీకాలు వేయనున్నారు. తద్వారా రెండు నెలల తర్వాత రథయాత్ర ప్రారంభమయ్యే సమయానికి రెండు మోతాదులు అందుతాయని అధికారులు అంచనాకు వచ్చారు. మరోవైపు, గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సందర్శకులు లేకుండానే రథయాత్ర నిర్వహించాలని స్థానిక అధికారులు నిర్ణయించారు.
ప్రతి సంవత్సరం మూడు రథాలను జగన్నాథ రథ యాత్ర కోసం సిద్ధం చేస్తారు. ఈ రథాలలో చక్రం నుంచి శిఖరం జెండా వరకు 34 వేర్వేరు భాగాలు ఉంటాయి. మూడు రథాల నిర్మాణంలో 4000 చెక్క భాగాలు తయారు చేస్తారు. వీటికి మొత్తం 13,000 క్యూబిక్ ఫీట్ కలపను ఉపయోగించనున్నారు. నాయగర్, ఖుర్దా , బౌధ్ ప్రాంతాల అడవుల నుండి 1,000 చెట్లను నరికి ఈ కలపను తీసుకొస్తారు.
అధిక రక్తపోటు.. చేయాల్సినవి.. చేయకూడనివి
శ్రీలంక క్రికెట్లో వివాదం: ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత
భద్రంగా అజ్మీర్లోని ఇజ్రాయెల్ మందిరం
24 మందితో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. చరిత్రలో ఈ రోజు
యుద్ధం కొనసాగుతుంది: బెంజిమిన్ నెతన్యాహు
అమెరికా ఉద్యోగం కన్నా పాడిలో నాలుగింతలు ఎక్కువ సంపాదన : కిషోర్ మంత్రం
గంగా నది ఇసుకలో సమాధులు.. వెలికితీసిన వరుణుడు
టెస్ట్ ఆడట్లేదని నేననలేదు : భువనేశ్వర్ కుమార్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..