హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు బంధు సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. బుధవారం మరికొంత మంది రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయనున్నది. 86,662 మంది రైతుల ఖాతాల్లో రూ.514.88 కోట్లు జమ కానున్నాయి. ఇప్పటి వరకు 60.57 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.7,178.67 కోట్లు ఆయా అన్నదాతల ఖాతాల్లో నగదు జమ చేసింది. వానాకాలం సీజన్లో 63.25 లక్షల మంది రైతులను అర్హులుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నెల 15న నుంచి రైతులకు పంట సాయం పంపణీ ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ వరకు పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి రూ.5వేల చొప్పన సాయం ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.