హైదరాబాద్ : సుమారు 15 నెలల తర్వాత ఎంఎంటీఎస్ రైళ్లు బుధవారం పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు ట్రైన్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి దశలో కేవలం పది ట్రైన్లను మాత్రమే నడువనున్నాయి. ఉదయం 7.50 గంటల నుంచి రాత్రి 7.05 వరకు నడవనున్నాయి. విద్యార్థులకు సంబంధించిన పాస్లు పొడగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. తప్పనిసరిగా ప్రయాణికులు కొవిడ్ నిబంధనలు పాటించాలని రైల్వే అధికారులు సూచించారు. విధిగా మాస్కులు ధరించడంతో పాటు, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు.
నేటి నుంచి నడిచే ట్రైన్ల వివరాలు..
ఫలక్నుమా-లింగంపల్లి సర్వీస్ (47154) ఉదయం 7.50కి ఫలక్నుమా నుంచి బయల్దేరి, 9.07 గంటలకు లింగంపల్లి చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్కు ఉదయం 8.20కి చేరుకుని, 8.22 గంటలకు తిరిగి బయల్దేరుతుంది.
లింగంపల్లి-ఫలక్నుమా సర్వీస్ (47178) ఉదయం 9.20కి లింగంపల్లి నుంచి బయల్దేరి, 10.42కి ఫలక్నుమా చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్కు 10.10కి చేరుకుని, 10.1 2గంటలకు తిరిగి బయల్దేరుతుంది.
ఫలక్నుమా-లింగంపల్లి సర్వీస్ (47157) ఉదయం 10.55కి ఫలక్నుమా నుంచి బయల్దేరి, 12.12కి లింగంపల్లి చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్కు 11.30కి చేరుకుని, 11.32 గంటలకు తిరిగి బయల్దేరుతుంది.
లింగంపల్లి-ఫలక్నుమా సర్వీస్(47181) మధ్యాహ్నం 12.40కి లింగంపల్లి నుంచి బయల్దేరి 2 గంటలకు ఫలక్నుమా చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్కు 1.25కి చేరుకుని, తిరిగి 1.27 గంటలకు బయల్దేరుతుంది.
ఫలక్నుమా-లింగంపల్లి సర్వీస్(47162) సాయంత్రం 4.20కి ఫలక్నుమా నుంచి బయల్దేరి, 5.45కి లింగంపల్లి చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్కు 4.55కు చేరుకుని, తిరిగి 4.57గంటలకు బయల్దేరుతుంది.
లింగంపల్లి-ఫలక్నుమా సర్వీస్ (47188) సాయంత్రం 6.05కి లింగంపల్లి నుంచి బయల్దేరి, 7.32కి ఫలక్నుమా చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్కు 6.50కు చేరుకుని, తిరిగి 6.52 గంటలకు బయల్దేరుతుంది.
లింగంపల్లి-హైదరాబాద్ సర్వీస్ (47131) ఉదయం 8.43కి లింగంపల్లి నుంచి బయల్దేరి, 9.28 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
హైదరాబాద్-లింగంపల్లి సర్వీస్ (47107) ఉదయం 9.36కి హైదరాబాద్ నుంచి బయల్దేరి, 10.21 గంటలకు లింగంపల్లి చేరుతుంది.
లింగంపల్లి-హైదరాబాద్ సర్వీస్ (47141) సాయంత్రం 5.15కి లింగంపల్లి నుంచి బయల్దేరి, 6.05గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
హైదరాబాద్-లింగంపల్లి సర్వీస్ (47119) సాయంత్రం 6.15కి హైదరాబాద్ నుంచి బయల్దేరి, రాత్రి 7.05 గంటలకు లింగంపల్లి చేరుతుంది.