రోమ్ : ఇటలీ ప్రధాన మంత్రి మారియో ద్రాఘి మిక్సింగ్ టీకాలు తీసుకున్నారు. మొదటి, రెండో డోస్ టీకాలను వేర్వేరు కంపెనీలకు చెందిన వాటిని తీసుకున్నారు. రెండో డోసుగా అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ వాక్సిన్ తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇంతకు ముందు మారియో తొలి డోసుగా ఆస్ట్రాజెనెకా కొవిడ్ టీకా తీసుకున్నారు. వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత తక్కువ సంఖ్యలో యాంటీబాడీలు అభివృద్ధి అయ్యాయి. దీంతో డోసులో భాగంగా ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొంది. ఇంతకు ముందు జర్మనీ వైస్ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ మిక్సింగ్ టీకాలు తీసుకున్నారు. మొదటి డోసు కిందట స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా టీకా తీసుకోగా.. రెండో డోసు కింద మోడెర్నా కంపెనీ టీకాను తీసుకున్నారు.