న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు ఇచ్చిన టీకాల సంఖ్య 29కోట్లు దాటింది. మంగళవారం రాత్రి 7 గంటల వరకు అందించిన తాత్కాలిక సమాచారం మేరకు మొత్తం 29,40,42,822 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ఒకే రోజు 48 లక్షలకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. 18-44 ఏజ్గ్రూప్లో ఒకే రోజు 32,81,562 మంది లబ్ధిదారులకు మొదటి డోస్, మరో 71,655 మంది రెండో డోసు తీసుకున్నారని పేర్కొంది.
మూడో దశలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6,55,38,687 మంది లబ్ధిదారులకు మొదటి, మరో 14,24,612 రెండో మోతాదు వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పది లక్షలకుపైగా ఏజ్గ్రూప్లో టీకాలు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.