లండన్ : బ్రిటన్లో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజులుగా రికార్డుస్థాయిలో 25 డిగ్రీలకు చేరుకోవడంతో.. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు దాదాపు 40 లక్షల మంది జనం సముద్రం ఒడ్డుకు చేరారు. సాధారణంగా ఇక్కడ మే-జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు 14-18 డిగ్రీల మధ్య ఉంటాయి.
బ్రిటన్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు బీచ్లు, రిసార్ట్ల బాట పట్టారు. పర్యాటక ప్రదేశాలన్నీ ప్రజలతో నిండిపోయాయి. చాలా ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేయడానికి రెండు గంటలు వేచి ఉండాల్సి వస్తున్నది. జూన్ మొదటి వారంలో ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరోవైపు, కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో గుంపులుగా ప్రజలు గుమిగూడుతుండటం కలవరపెడుతున్నది.
బ్రిటన్లో కొత్త వేరియంట్ కనిపించన తర్వాత 27 శాతం కేసులు, 43 శాతం మరణాలు పెరిగాయని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. యూకేలో థర్డ్ వేవ్ సంకేతాలు ఉన్నాయని, గత 10 రోజుల్లో దేశంలో కరోనా కేసులు వేగంగా పెరగడానికి కొత్త వేరియంటే కారణం అని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రవి గుప్తా తెలిపారు. మరోవైపు, కరోనా వైరస్ ఆంక్షల సడలింపు చివరి దశ జూన్ 21 న ఇంగ్లండ్లో అమల్లోకి వస్తుంది. దేశంలో లాక్డౌన్ మరింత సడలించినట్లయితే.. B1.6172 వైరస్ ఊపందుకుని దేశానికి పెద్ద సమస్యగా మారవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
నేటి నుంచి గూగుల్ ఫొటో ఉచిత సేవలు బంద్
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృతతో తింటూ ఆరేండ్ల శరణార్థి కన్నుమూత
ప్రధాని కలల ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి
నేపాల్ రాజ కుటుంబం ఊచకోత.. చరిత్రలో ఈరోజు
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..