లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టులో ప్రమాదం సంభవించింది. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్లో శిథిలమైన హాస్టల్ కూలిపోవడంతో ఇద్దరు కూలీలు చనిపోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు.
కాశీ విశ్వనాథ్ కారిడార్లోని లలితా ఘాట్ వద్ద స్వాధీనం చేసుకున్న శిథిలమైన పాత భవనం ఒకటి కుప్పకూలిపోయింది. దాదాపు తొమ్మిది మంది కార్మికులను శిథిలాల కింద ఉండిపోయారు. స్థానికులు, పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టగా ఏడుగురు గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం దగ్గర్లోని దవాఖానకు పంపించారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. కారిడార్ పనుల్లో నిమగ్నమైన 9 మంది కూలీలు ఈ భవనంలో పడుకున్నారని స్థానికులు చెప్పారు. పశ్చిమ బెంగాల్ మాల్డా జిల్లాలోని కలియా చక్ నివాసి అబ్దుల్ మోమిన్ (25), అమీనుల్ మోమిన్ (45) ఈ ప్రమాదంలో మరణించారు.
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ కారిడార్ను కాశీ విశ్వనాథ్ ఆలయం, మణికర్ణిక ఘాట్, లలితా ఘాట్ మధ్య 25 వేల చదరపు మీటర్లలో నిర్మిస్తున్నారు. దీని కింద ఫుడ్ స్ట్రీట్, రివర్ ఫ్రంట్ సహా బనారస్లోని ఇరుకైన రహదారులను వెడల్పు చేసే పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత గంగా ఒడ్డున 50 అడుగుల రహదారి ద్వారా బాబా విశ్వనాథ్ ఆలయానికి వెళ్ళగలరు. భవనాల కొనుగోలు, కూల్చివేత పనులు జోరుగా సాగుతున్నాయి.
నేపాల్ రాజ కుటుంబం ఊచకోత.. చరిత్రలో ఈరోజు
కాంగోలో ఉగ్ర దాడి, 39 మంది మరణం
త్వరలో మిక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ : డాక్టర్ అరోరా
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..