న్యూఢిల్లీ : (Rakesh Tikait) ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన అక్కడ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఇతర నాయకులతో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశం కానున్నారు. ఈ సమయంలో ఢిల్లీ శివారులో ఆందోళన చేస్తున్న రైతుల పక్షాన రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్.. జో బైడెన్కు ట్వీట్ చేశారు. మోదీతో సమావేశంలో మా సమస్యను కూడా చర్చించండి అని రాకేశ్ తికాయత్ తన ట్వీట్లో బైడెన్ను కోరారు.
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్నాళ్లుగా రైతులు ఢిల్లీ శివారులో ఆందోళన చేస్తున్నారు. వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలు చర్చలు కూడా జరిపారు. అయితే, ప్రతిష్ఠంభన నెలకొనడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉండటంతో.. దీనిని కూడా తమ ఆందోళనకు వాడుకోవాలని తికాయత్ ఆలోచించారు. ‘డియర్ @ పోటస్.. అంటూ ట్వీట్ పోస్ట్ చేశారు. ‘ప్రధాని మోదీ తీసుకొచ్చిన 3 అగ్రి చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్నాం. గడిచిన 11 నెలల కాలంలో 700 మంది రైతులు చనిపోయారు. మమ్మల్ని రక్షించేందుకు వెంటనే ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ప్రధాని మోదీతో సమావేశంలో ఈ అంశాలను ఫోకస్ చేయండి’ అంటూ జో బైడెన్కు విజ్ఞప్తి చేశారు. ఈ ట్వీట్ను ఇప్పటివరకు వేలాది మంది రీట్వీట్ చేశారు. అలాగే పెద్ద సంఖ్యలో లైక్ చేశారు.
ప్రపంచంలో ఇదే అతి తెల్లని పెయింట్..!
బాధితురాలి బట్టలు ఉతకమని నిందితుడికి శిక్ష
కొవిడ్ మృతుల జ్ఞాపకార్ధం 6 లక్షల తెల్ల జెండాలు
గాంధీ-అంబేడ్కర్ మధ్య పుణె ఒప్పందం.. దళితులకు 2 ఓట్లు రద్దు
విషపూరిత నీరు తాగినా.. ఈ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది!
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..