Loksabha Elections 2024 : కాంగ్రెస్ అంటే అవినీతికి మారుపేరని, ఆ పార్టీ హయాంలో అవినీతి విచ్చలవిడిగా సాగిందని రాజస్దాన్ మంత్రి, బీజేపీ నేత రాజ్యవర్ధన్ రాథోర్ ఆరోపించారు. అవినీతి, కుంభకోణాలకు పాల్పడటం ఆ పార్టీ నైజమని, బీజేపీ అవినీతిని ఉపేక్షించదని స్పష్టం చేశారు. బీజేపీ, ప్రధాని మోదీ ప్రజలకు సేవకులు మాత్రమే అని చెప్పారు.
తాము అవినీతిని, ఉగ్రవాదాన్ని సహించబోమని అన్నారు. రాహుల్ గాంధీ బీజేపీపై అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. ఇదే రాహుల్ గాంధీ 2008లో చైనా వెళ్లి బీజింగ్తో రహస్య ఒప్పందంపై సంతకాలు చేశారని అన్నారు.
చైనాకు దేశాన్ని తెగనమ్మేందుకు ఆయన ఒప్పందం చేసుకున్నారని దుయ్యబట్టారు. అలాంటి రాహుల్ గాందీ ఇవాళ బీజేపీని ప్రశ్నిస్తున్నారని అన్నారు. తాము కుటుంబం కోసం కాకుండా ముందుగా దేశం కోసం పనిచేస్తామని చెప్పారు. దేశాన్ని నడిపే తెలివి రాహుల్ కుటుంబానికి ఉంటే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ను ఎందుకు వీడుతున్నారని రాజ్యవర్ధన్ ప్రశ్నించారు.
Read More :