అమరావతి : నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరుగనుంది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ముందుకు కేసు విచారణకు రానుంది. ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు ఆయనను రాజద్రోహం, తదితర కేసుల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ దవాఖానలో వైద్య పరీక్షలు చేసి, నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఈ నెల 17వ తేదీన ఆదేశించిన విషయం విధితమే. వైద్య పరీక్షలకు సంబంధించి ఆర్మీ ఆస్పత్రి వైద్యులు రూపొందించిన నివేదిక తెలంగాణ హైకోర్టు ద్వారా గురువారం సుప్రీంకోర్టుకు చేరింది. మరోవైపు.. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగా.. ఏపీ ప్రభుత్వం సైతం కౌంటర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.