కలెక్టర్ పమేలా సత్పతి
భువనగిరి అర్బన్, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాత బస్డాండ్ వరకు నిర్వహించిన గ్రీన్ ర్యాలీని ఆదివారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించి ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు ఏఈఈ వీరేశం, ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భువనగిరి కోర్టు ఆవరణ నుంచి చేపట్టిన ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, భువనగిరి మండల న్యాయ సేవా సమితి అధ్యక్షుడు వి.బాలభాస్కర్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ఆయా కార్యక్రమాలల్లో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.