మిర్యాలగూడ, మే 9 : పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ప్రజలందరికీ న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డ 2వ వార్డు మాజీ కౌన్సిలర్, ఉద్యమకారుడు గుడిసె దుర్గాప్రసాద్తోపాటు మరో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు వారికి గులాబీ కండువాలు కప్పి మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అమలు కాని హామీలను గుప్పించడంతో ప్రజలు మోసపోయారన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.15కోట్లతో తాళ్లగడ్డలో 100 ఫీట్ల రోడ్డు మంజూరు చేయించామని, రూ.2కోట్లతో ధోబీఘాట్, రూ.5.50కోట్లతో వైకుంఠధామాన్ని నిర్మించామని తెలిపారు.
కొంత మంది పదవులను ఆశించి పార్టీలు ఫిరాయించారని, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడొద్దని, తిరిగి నూతన క్యాడర్ను నిర్మించుకొని పార్టీని బలోపేతం చేసుకుందామని చెప్పారు. గతంలో మాదిరిగా దుర్గాప్రసాద్కు టికెట్ ఇచ్చి గెలిపించుకుందామన్నారు. మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ర్టాభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని, ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని తెలిపారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిచేలా తనవంతుగా కృషి చేస్తానన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో శ్యామలమ్మ, నాగమ్మ, కోలా ఎల్లమ్మ, గుడిసె అశోక్, రాంరెడ్డి, నారన్న, కురివి వెంకన్న, రాంబాబు, సైదులు, రాపోలు శ్రీనివాస్, వేణుగోపాల్రెడ్డి, ఇమ్రాన్, ఇర్ఫాన్, నాగేందర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, యువనేత సిద్ధార్థ్ధ, కౌన్సిలర్లు ఇలియాస్ఖాన్, శ్యామ్సుందర్రెడ్డి, కమ్లి, భీమ్లానాయక్, బల్లెం అయోధ్య, వజ్రం, మాజీ కౌన్సిలర్లు మాజీద్, కరీం, రఘుయారెడ్డి, ఎర్ర శ్రీను, సుబ్బారావు, పునాటి లక్ష్మీనారాయణ, పిన్నబోయిన శ్రీనివాస్యాదవ్, నేరెళ్ల శివ, గుల్, చోటు పాల్గొన్నారు.